టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జనవరి నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను అతడిని ఈ అవార్డుకు నామినేట్ చేశారు. సూర్యతో పాటు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ డారల్ మిచెల్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చాడు. గతేడాది ఈ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి సౌకర్యం కోసం హార్దిక్ ఈ విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది పల్లెకెలె స్టేడియంలో జరిగిన 6 మ్యాచ్ల్లో 5 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అందుకే శ్రీలంక కెప్టెన్ కూడా ఛేజింగ్కే మొగ్గు చూపాడు. ఈ పిచ్పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులుగా ఉంది.
ఇవాళ్టి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి విషయంలో బ్యాటర్లు అప్రమత్తంగా ఉండాలని క్వింటన్ డికాక్ పేర్కొన్నాడు. గతంలో భారత్తో సిరీస్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని గుర్తుచేశాడు. అందుకే వరుణ్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. రెండు జట్లలోనూ బలమైన ఆటగాళ్లు ఉన్నందున, ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.
భారత్తో పాక్ మ్యాచ్ ఓడిపోవడానికి టీమ్ సెలక్షనే కారణమని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాకిస్తాన్కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న విషయం తెలిసిందే. కాగా, పాక్ సెమీస్ చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.
పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్ చేరాడు. ఈ లీగ్లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్కీపర్ రూబిన్ హెర్మన్ వీరి సరసన చేరాడు. హెర్మన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్తో జతకట్టిన అనంతరం హెర్మన్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మరో గుడ్ న్యూస్ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కూడా నామినేట్ అయ్యారు.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ మైక్ హెసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్లలో ఓపెనర్గా పవర్ ప్లే సమయంలో బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉందని, ఇది ఆధునిక T20 ఫార్మాట్కు సరిపోదని పేర్కొన్నాడు. ‘జట్టుకు ఏం అవసరమో బాబర్కు తెలుసు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేనప్పుడు, మిడిల్ ఓవర్లలో జట్టును ఆదుకోవడం మంచిదని భావించాం’ అని తెలిపాడు.
T20 ప్రపంచకప్-2026లో భాగంగా సెమీస్లో భారత్-పాక్ తలపడితే ఆ మ్యాచ్ MAR 4న జరుగుతుంది. దేశమంతా హోలీ వేడుకల్లో ఉండగా.. శ్రీలంక గడ్డపై దాయాదుల పోరు ఉత్కంఠను పంచనుంది. ఒకవేళ పాక్ కాకుండా మరే ఇతర జట్టుతోనైనా భారత్ సెమీఫైనల్ అడితే ఆ మ్యాచ్ ముందుగా నిర్ణయించినట్లే MAR 5న ముంబైలోనే జరగనుంది. ఈ నిబంధనల ప్రకారం పాక్ ఆడే తొలి సెమీస్ కూడా కోల్కతా నుంచి కొలంబోకు మారుతుంది.
T20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపింది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు చెరొక పాయింట్ను కేటాయిస్తారు.
నాకౌట్ మ్యాచ్లలో దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత్ను ఓడించలేదు. ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్లలో రెండుసార్లు తలపడ్డాయి. భారత్ రెండింటిలోనూ గెలిచింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో తలపడ్డాయి. భారత్ విజయం సాధించింది. 2024 ఫైనల్లో భారత్ గెలుపొందింది. IND, SA ఫామ్ను పరిశీలిస్తే.. రెండు జట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.
T20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సా.7 గంటలకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్లు ఆడాయి. వీటిలో 21 మ్యాచుల్లో భారత్, 13 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, టీమిండియాదే పైచేయి అనిపిస్తుంది.
జపాన్లో జరుగుతున్న ఆసియా క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లో భారత్ నాలుగు పతకాలు సాధించింది. 10 కిలో మీటర్ల పరుగు పోటీలో హర్మన్జ్యోత్ రజతం గెలుచుకున్నాడు. టీమ్ పోటీల్లో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. అండర్-20లో మహిళలు, పురుషుల జట్లు కాంస్యం గెలిచాయి. మహిళల 10 కిలోమీటర్ల టీమ్ విభాగంలో భారత బృందం కంచు నెగ్గింది.
అంధుల క్రికెట్లో టీమిండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ క్రికెట్లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారని బీసీసీఐ అధ్యక్షుడు మిథన్ మన్హాస్ కొనియాడారు. వారి విజయాలు భారత క్రికెట్కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్లేయర్లకు గుర్తింపును అందించడమే బీసీసీఐ లక్ష్యమని మిథున్ వెల్లడించారు.