ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ‘GOAT’ టూర్లో భాగంగా భారత్లో పర్యటిస్తున్నాడు. ఇప్పటికే కోల్కతా, HYD, ముంబై నగరాలను చుట్టేశాడు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా PM మోదీతో భేటీ కానున్నారు. అలాగే, CJI, ఆర్మీ చీఫ్లను కూడా కలవనున్నారు. చివరిగా అరుణ్ జైట్లీ స్టేడియంలో క్రికెట్, సినీ ప్రముఖులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతాడు.