SMATలో పంజాబ్పై ఆంధ్ర జట్టు ఉత్కంఠ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆంధ్ర, కేవలం ఒక్క బంతి మిగిలి ఉండగానే, 5 వికెట్ల తేడాతో ఛేదించింది. హేమంత్ రెడ్డి అజేయ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే, ప్రసాద్(53*) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ రెడ్డి పరుగుల ఖాతా తెరువలేకపోయాడు.