సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో ప్లేయర్గా నిలిచాడు. హార్దిక్ కంటే ముందు అర్షదీప్ (108), బుమ్రా (100) మాత్రమే T20Iల్లో భారత్ తరఫున వంద వికెట్లు తీశారు. అలాగే, మరో 61 పరుగులు తీస్తే T20Iల్లో హార్ధిక్ 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.