మహిళల భారత జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. అయితే, విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగేలా లేదు. ఈ విషయాన్ని BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా వెల్లడించారు. దుబాయ్లో ఇవాళ్టి నుంచి 7 వరకు ICC సమావేశాలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత సీనియర్ అధికారులు భారత్కు రానున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.