KDP: మాజీ మంత్రి డాక్టర్ డి.యల్ రవీంద్రారెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖాజీపేట మండలంలోని పునీత లారెన్స్ వృద్ధాశ్రమం, భూమయపల్లిలోని అమ్మ వృద్ధాశరణాలయంలో వృద్ధులు, అనాథలకు అన్నదానం జరిగింది. అలాగే, మైదుకూరు బస్టాండ్ పరిసరాల్లో నిరాశ్రయులకు, బాటసారులకు అల్పాహారం, నీటి బాటిళ్లు పంపిణీ చేశారు.
ప్రకాశం: ముండ్లమూరు మండలంలో ఆదివారం పోలీసులు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు. కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపి నంబర్లు అడిగితే చెప్పవద్దని సూచించారు
WGL: నవంబర్లో కురిసిన మొంథా తుఫాన్తో ఇబ్బందులు పడుతున్న వరంగల్ మైసయ్య నగర్కు చెందిన వరద బాధితులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఇవాళ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ పాల్గొని, దాదాపు 150 వరద బాధిత కుటుంబాలకు రూ.15,000 విలువైన సరుకులను అందించారు.
MHBD: నర్సింహులపేట మండలం వస్త్రంతండా గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థిగా ఎంబీఏ, బీఈడీ విద్యార్థిని అఖిల బరిలో నిలిచారు. అఖిలను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంబీఏ పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ చదువుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
KMM: ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతివ్వాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు కోరారు. వైరా మండలం విప్పలమడక గ్రామపంచాయతీలో సీపీఎం అభ్యర్థి ముత్తమల సంపూర్ణ విజయం కోసం ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను విస్మరించిందని ఆరోపించారు.
KNR: గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సామ రాజిరెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్లో శాలువాతో సన్మానించారు. రాజిరెడ్డి గ్రామస్థులతో కలిసి బండి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులు త్వరలోనే అందిస్తానని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజాపూర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం ఎస్సై రాముడు పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు పరిశీలించారు. సీసీ కెమెరాలు, క్యూలైన్ల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్లో విద్యుత్ సౌకర్యాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో ఎన్నికల సమయంలో పటిష్ఠ పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
VKB: కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనాపూర్ ఎక్స్-రోడ్ వద్ద జరిగిన సెల్ఫ్-రోడ్ ప్రమాదంలో ఒక యువకుడు మరణించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. కుల్కచర్ల నుంచి నంచర్ల వైపు వేగంగా వెళ్తున్న బైక్ నియంత్రణ కోల్పోయి రాయిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
చైనాలోని షాంఘైలో భారత కాన్సులేట్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. చైనాలో భారత రాయబారి అయిన ప్రదీప్ కుమార్ రావత్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చైనాలోని భారత ప్రతినిధులు, ఇతర విదేశీ దౌత్యవేత్తలతో సహా 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. కాగా, షాంఘై చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రం కావడం గమనార్హం.
ATP: గుంతకల్లు R&Bలో ఆదివారం ఉచిత గ్యాస్ పథకం సమస్యలు, అపోహలపై గ్యాస్ ఏజెన్సీలతో మండల తహసీల్దార్ రమాదేవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో సుమారు 500 మంది గ్యాస్ లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పథకం పై అపోహలు, సమస్యలను గ్యాస్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఏ కారణం చేత బ్యాంకు ఖాతాలో డబ్బులు జమా కాలేదో వివరించామన్నారు.
SDPT: బెజ్జంకిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇస్కిల్ల ఐలయ్య, కొండ్ల వెంకటేశం, ద్యావనపల్లి శ్రీనివాస్, బొల్లం శ్రీధర్, సంఘ రవి మధ్య పోటీ జరుగుతోంది. మొత్తం 14 వార్డులు ఉండగా 12వ వార్డు సభ్యుడిగా తిప్పారపు మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 13 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని జైపూర్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. డుంబ్రిగుడ(M) బోడపుట్ గ్రామానికి చెందిన కిల్లో సునీల్ అనే యువకుడు అరకు వైపు నుంచి డుంబ్రిగూడ వైపు బొల్లేరో వాహనంలో వస్తున్న సమయంలో అద్భుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన అతడిని అంబులెన్స్లో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ADB: దేశంలోని ప్రజానీకం శాంతియుతంగా మెలగాలని ఆదివారం నార్నూర్ మండలంలోని గుండాల గోండుగూడ గ్రామ ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామ ప్రధాన రహదారి మూలపై కొలువుదీరిన పోచమ్మ తల్లి మందిరం వద్ద ప్రత్యేక వంటలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కుపటేల్, జంగు, రాజు, అర్జు పాల్గొన్నారు.
NZB: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిచాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.
JGL: యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో పాట రచించడం అభినందనీయమని, జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ పట్టణంలో వేణు రచించిన ఎత్తురా జెండా పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి అనిల్ కుమార్, ఉదయశ్రీ, రాణి, సాయికుమార్, శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్, మహేందర్, ప్రశాంత్ రావు, రాంప్రసాద్ పాల్గొన్నారు.