PPM: ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ నిర్వహణపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు లేదా సేవల వల్ల మోసపోతే తక్షణమే ఫిర్యదు చెయ్యాలన్నారు.
SKLM: ఆముదాలవలస పురపాలక సంఘం పరిధిలో గృహ నిర్మాణ పథకానికి అర్హులైన 297 మందికి అనుమతి పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే కూన రవి కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వము కట్టుబడి ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ హౌసింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు.
KKD: పిఠాపురం మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో హార్వెస్ట్ స్కూల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల హక్కులు, విద్యార్థి హక్కులు, న్యాయ సహాయం వంటి అంశాలను సులభంగా వివరించారు. చట్టాలపై జ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు. ఉచిత న్యాయ సహాయం కావాల్సిన వారు సేవా సంఘాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
WNP: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు న్యాయం జరుగుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి(M) పెద్దగూడెం గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రూ. 78 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
WNP: జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఈ మండలాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందన్నారు.
NDL: చాగలమర్రి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి వివరించి వినతిపత్రాలు సమర్పించారు. 200కి పైగా అర్జీలు రావడంతో, ఎమ్మెల్యే ప్రతి ఒక్క అర్జీని వ్యక్తిగతంగా స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లాలో హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందిన కెప్టెన్ దీపిక పవన్ కళ్యాణ్ను తండాకు రోడ్డు వేయాలని కోరారు. దీంతో పవన్ తక్షణ చర్యలకు ఆదేశించారు.
NLR: ఉదయగిరి పట్టణంలోని శ్రీ బాలాజీ ఫుట్ వేర్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంపై నిర్వాహకుడు నరసింహులు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితమే వ్యాపారం ప్రారంభించిన ఆయన, తెల్లవారుజామున సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నానని తెలిపారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగిందని, పోలీసులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు.
WNP: రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సవాయిగూడెం, పెద్దగూడెం తాండా, కడుకుంట్ల గ్రామాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో నియంత పాలనకు చరమగీతం పాడాలని రామాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రెండేళ్లుగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. BRS నాయకులను గెలిపించాలన్నారు.
ప్రకాశం: కంభం మండలంలోని సూరేపల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనగ పంటలో మిత్ర పురుగులు శత్రు పురుగులు వాటి వివరాలు, నిష్పత్తి బట్టి పురుగుల మందుల వాడకం గురించి వివరించారు. ప్రస్తుతం పంటలో ఎండు తెగులు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వెల్లడించారు.
BPT: మాజీ సైనికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ‘స్పర్శ’ కార్యక్రమం ద్వారా పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సహకరిస్తాయని చెప్పారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలని మాజీ సైనికులను ఆయన కోరారు.
VZM: విజయనగరంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమన్నారు. ఈనెల 15వ తేదీ ఉ.10 గంటలకు CMR జంక్షన్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈనెల 18న గవర్నర్కు ఈ సంతకాల పత్రాలు అందజేస్తామన్నారు.
MNCL: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీ డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన సాయి ఈశ్వరచారి ఆశయసాధన, రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు.
PLD: దుర్గి మండలంలో కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం పర్యటించారు. దరివేముల గ్రామంలోని బుగ్గవాగు రిజర్వాయర్లో నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులు, ఇంజినీరింగ్ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం జాతీయ హస్తకళల వారోత్సవాలలో భాగంగా, లేపాక్షి ఎంపోరియం ఆధ్వర్యంలో 30 మంది కళాకారులకు స్టోన్ కార్వింగ్పై ప్రారంభమైన రెండు నెలల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
KRNL: గోనెగండ్లలో నకిలీ కావేరి మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సీపీఐ నాయకులు తహసీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చి నకిలీ విత్తనాలు అమ్మిన కావేరి సీడ్స్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మద్దిలేటి నాయుడు, మాలిక్ డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.