• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి’

NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల రిత్యా ప్రతి ఒక్కరూ ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. గురువారం సాయంత్రం చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

December 5, 2025 / 05:32 AM IST

బాలుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

ASF: తిర్యాణి మండలం ఉల్లి పిట్ట గ్రామంలో 2023లో జరిగిన బాలుడి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జడ్జి జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ప్రేమ పేరుతో వ్యక్తిని హెచ్చరించినందుకు బాలుడిని హత్య చేశారని బాధితుడి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చగా జడ్జి వారికి శిక్ష విధించారన్నారు.

December 5, 2025 / 05:29 AM IST

‘వెల్నెస్ సెంటర్‌లో వైద్యుల కొరత తీర్చాలి’

NZB: ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో భాగంగా ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల కోసం నగరంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్‌లో డాక్టర్లను నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

December 5, 2025 / 05:24 AM IST

తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్టును అధికారులు విడుదల చేశారు. 7 మండలాల్లో కలిపి 192 సర్పంచి స్థానాలకు 476, 1,740 వార్డుల స్థానాలకు 3,275 మంది పోటీ పడుతున్నారు. కొణిజర్ల S-73 W-524, రఘునాథపాలెం S-106 W-589, వైరా S-50 W-348, బోనకల్ S-46 W-414, చింతకాని S-64 W-466, మధిర S-67 W-468, ఎర్రుపాలెం S-70 W-466.

December 5, 2025 / 05:24 AM IST

ఎస్కేయూ పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు

ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లోని వివిధ పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లను తక్షణ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య నరసింహన్ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. పీజీసెట్‌లో అర్హత సాధించిన లేదా పరీక్ష రాయని విద్యార్థులు కూడా ఈ ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.

December 5, 2025 / 05:23 AM IST

మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నిన్న మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనకాలజిస్ట్ ఔట్ పేషెంట్ వద్ద సిట్టింగ్ సామర్థ్యం పెంచాలని, గర్భిణీ మహిళలు నిలబడాల్సిన అవసరం రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మసీ స్టోర్‌లో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాలని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన పరికరాలు అందించాలన్నారు.

December 5, 2025 / 05:20 AM IST

కలెక్టరేట్‌లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: జిల్లా కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు ముమ్మరంగా నడుస్తూ చివరి దశకు చేరాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణ నందు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ నిన్న పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

December 5, 2025 / 05:20 AM IST

‘పిల్లలు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి’

AKP: పిల్లలు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఎలమంచిలి ఎస్సై సావిత్రి సూచించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎర్రవరంలో నిర్వహించిన డ్వాక్రా మహిళల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

December 5, 2025 / 05:16 AM IST

జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

JGL: జిల్లాలో నలుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం ప్రకటించారు. మెట్ పల్లి మండలం చింతల్ పెట్ గ్రామ సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేష్, మూలరాంపూర్ సర్పంచ్ కనుగంటి లాస్య ప్రియ, కథలాపూర్ మండలం రాజారాం తండా సర్పంచ్‌గా భూక్య తిరుపతి ఎన్నికైనట్లు పేర్కొన్నారు.

December 5, 2025 / 05:16 AM IST

స్క్రబ్ టైఫస్ నివారణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

KDP: రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ ఫీవర్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం CS విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో JC అదితి సింగ్‌తో కలిసి పాల్గొన్న ఆయన వరి సేకరణ, ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధులపై చర్చించారు. ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రాలను ఆవిష్కరించారు.

December 5, 2025 / 05:15 AM IST

నేడు పలాసలో ఎమ్మెల్యే పర్యాటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష శుక్రవారం ఉ. 9.30 గంటలకు పూండి జూనియర్ కాలేజీలో మెగా వైద్య శిబిరం ప్రారంభిస్తారు. ఉ.10.30 కు బ్రాహ్మణతర్ల జడ్పీ స్కూల్‌లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో, ఉ.12 కు పలాస మున్సిపాలిటీ లో స్థానిక జడ్పీ స్కూల్‌లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.

December 5, 2025 / 05:09 AM IST

సర్పంచ్ లకు 155, వాటి సభ్యులకు 304 నామినేషన్లు

JGL: జిల్లాలో 3వ విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు 155, వార్డు మెంబర్ స్థానాలకు 304 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుగ్గారం మండలంలో 17, ధర్మపురి 31, ఎండపల్లి 15, గొల్లపల్లి 35, పెగడపల్లి 42, వెల్గటూర్ మండలంలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

December 5, 2025 / 05:08 AM IST

ఎమ్మెల్యేను కలిసిన క్రీడల అభివృద్ధి అధికారి

సత్యసాయి: జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తచెరువు జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియం పునర్నిర్మాణ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యేకు కిషోర్ వివరించారు. జిల్లాలో క్రీడా వేదికల అభివృద్ధికి, యువతకు అవకాశాల కల్పనకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

December 5, 2025 / 05:02 AM IST

నాగలింగం మరణం బాధాకరం: ఎమ్మెల్యే

ATP: ఎల్లుట్ల గ్రామానికి చెందిన నాగలింగం ఆకస్మిక మరణం బాధాకరమని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. వ్యాపార నష్టాలు, అప్పుల ఒత్తిడి కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసి విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి పిల్లల చదువులు, భార్యకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

December 5, 2025 / 05:00 AM IST

అవని కరదీపికను ఆవిష్కరించిన కలెక్టర్ శ్రీధర్

KDP: ‘ఒక కుటుంబం -ఒక వ్యాపారవేత్త’ అనే నినాదంతో మెప్మా సంస్థ రూపొందించిన ‘అవని’ కరదీపికను కలెక్టర్ శ్రీధర్ గురువారం ఆవిష్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కరదీపికను ప్రత్యేకంగా తయారుచేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ సూచించారు.

December 5, 2025 / 05:00 AM IST