• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

వీడియో: బన్ని ఉత్సవంలో కర్రల సాము…70 మందికిపైగా గాయాలు

ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రీమాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవం జరుపుతున్నారు. ఈ ఏడాది కూడా వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన కర్రల సా...

October 6, 2022 / 12:06 PM IST

సీఐ అంజూయాదవ్‌ను అరెస్ట్ చేయాలని..NCW ఆదేశం

ఏపీలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యారు. సీఐ దురుసు ప్రవర్తనతో ఆమెపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన మహిళకు వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు సీఐ అంజూ యాదవ్ తాను కావాలని దాడి చేయలేదని ఆడియో రిలీజ్ చేశారు...

October 4, 2022 / 06:53 PM IST

కేసీఆర్ పీఎం కావాలని.. ఫ్రీగా మందు, కోళ్ల పంపిణీ

ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు. తెలంగాణ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. TRS నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కేటీఆర్ న...

October 4, 2022 / 06:19 PM IST

స్నానం కోసం వెళ్లి ముగ్గురు మృతి

ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప...

October 4, 2022 / 03:20 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,825 కోట్ల ఫైన్

తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ ఎదురైంది. జాతీయా హరిత ట్రైబ్యునల్ (NGT) రాష్ట్రంపై ఏకంగా రూ.3,825 కోట్ల జరిమానాను విధించింది. ద్రవ, ఘన వ్యర్థాలను సరియైన క్రమంలో నిర్వహించనందుకు ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ మొత్తం రెండు నెలల్లో ఆయా ఖాతాల్లో జమ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ది ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. దీంతోపాటు ఉన్న వ్యవస్థలను ఆధునీకరించుక...

October 4, 2022 / 02:48 PM IST

దారుణ హత్యకు గురైన పోలీస్ ఉన్నతాధికారి

జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్ల...

October 4, 2022 / 11:54 AM IST

భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…1,190 పాయింట్లు వృద్ధి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 4న) భారీ లాభాలతో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ ఒకదశలో 1,191 పాయింట్లు పెరుగగా.. NSE నిఫ్టీ 345 పాయింట్లు వృద్ధి చెందింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 979, 533 పాయింట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధోరణులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సోమవారం ఆసియా, అమెరికా మార్కెట్లు పుంజుక...

October 4, 2022 / 11:47 AM IST

మునుగోడు(munugode)లో ఎవరిది గెలుపు?

మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో..నెల రోజుల్లో ఎలా ప్రచారం చేయాలనే దానిపై పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో మునుగోడులో గ్రామం నుంచి మండల స్థాయి నేతలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ ప్రజాదారణ ఉన్న నేతలకు లక్షల రూపాయలు సైతం ఇచ్చేందుకు పార్టీలు రెడీగా ఉన్నట్...

October 3, 2022 / 06:01 PM IST

HYDలో కొత్త ట్రాఫిక్ రూల్స్..గీత దాటితే ఫైన్

హైదరాబాద్ లో మీరు ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ వెలిగినా కూడా మీ వాహనాలు వైట్ లైన్లను దాటుతున్నాయా.. అయితే మీకు జరిమానా తప్పదు. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అంతేకాదు వైట్ లైన్ క్రాస్ చేసి ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డుగా ఉన్నా కూడా ఫైన్ విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. రోడ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్ మెంట్ (రోప్...

October 3, 2022 / 06:50 PM IST

SI, PC క్వాలిఫై మార్కులు తగ్గింపు …త్వరలో రిజల్ట్స్

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉద్యోగార్థుల క్వాలిఫై మార్కులను తగ్గిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది. 200 ప్రిలిమ్స్ మార్కుల పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు 20 శాతం అర్హత మార్కులుగా కేటాయించారు. దీంతో ఓసీలకు 60, బీసీ...

October 3, 2022 / 06:48 PM IST

రాజకీయాల్లోకి అస్సలు రాను.. నాగార్జున క్లారిటీ…!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది రాజకీయాల్లో తమ హవా చాటుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున సైతం రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన జగన్ కి కాస్త క్లోజ్ గా ఉంటారు కాబట్టి.. వైసీపీలో చేరతారంటూ ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. కాగా తాజాగా ఈ వార్తలపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చే సమయంలో తాను రాజకీయాలలోకి రాబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున...

October 1, 2022 / 06:23 PM IST

వరంగల్  లో మెడికల్ కాలేజీ ప్రారంభించిన కేసీఆర్…!

వరంగల్ జిల్లాలో ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన మెడికల కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణలో భవిష్యత్తులో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుక...

October 1, 2022 / 06:07 PM IST

MMTS రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం.. భయంతో ప్రయాణికుల పరుగులు..!

హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేటలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క కుదుపుతో ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బేగంపేట నుంచి నెక్లెస్‌ రోడ్డు వైపు వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ట్రైన్ ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ ఆగిపోయింది.  బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్ రూట్ లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లోకల్ ట్రైన్ నాంపల్లికి వెళ్తున్న సమ...

September 30, 2022 / 05:47 PM IST

సొంత జెట్ విమానం కొనుగోలు చేసే ప్లాన్ లో కేసీఆర్…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంతంగా ఓ జెట్ విమానం కొనుగోలు చేయనున్నారు. దీని కోసం ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఈ విషయంలో ఆయన కీలక ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కూడా. కాగా.. ఇప్ప‌టికే పార్టీ పేరును సిద్ధం చేసుకున్నారు, విజ‌య‌ద‌శ‌మి రోజున సీఈసీకి స‌మ‌ర్పించే ప‌త్రాల‌పై సంత‌కాలు చేయ‌నున్నారు. ఇక ...

September 30, 2022 / 05:43 PM IST