కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభ్యులు సంతాపం తెలిపారు. రేపు ఢిల్లీ రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మరోవైపు మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది.