TG: RTC కార్మికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కార్మికులు, సిబ్బందికి దసరా సందర్భంగా పండగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపు చేయాలని సూచించింది. ఈ అడ్వాన్స్ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా 10 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.