ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆదివారం ఆదాయం రూ.58,338లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.20,040లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ.22,550లు ఆదాయం లభించిందన్నారు. అదేవిధంగా అన్నదానానికి విరాళాల ద్వారా రూ.10,232లు, శ్రీవారి పాదుకులకు రూ.5516లు ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.