TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగుకు నీటిని మంత్రి విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించనున్నారు.