AP: మహానాడు ప్రాంగణంలో సీఎం చంద్రబాబు సందడి చేశారు. ప్రాంగణం మొత్తం తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. టీడీపీ ప్రస్థానం ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ఇటీవల మరణించిన టీడీపీ నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలనతో మహానాడును ప్రారంభించనున్నారు.