ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. తుర్కీయే నుంచి ఢిల్లీ, ముంబైకి రావాల్సిన రెండు ఇండిగో విమానాలు ముందస్తు సమాచారం లేకుండా రద్దవడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆహారం, వసతులు లేక ఇబ్బందిపడినట్లు ప్రయాణికులు ఎక్స్లో పోస్ట్లు చేస్తున్నారు.