ATP: వినాయక చవితి పండుగకు మట్టి విగ్రహాలను పూజించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి పిలుపునిచ్చారు. మట్టి గణపయ్యలను పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని కోరారు. రంగురంగుల విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. నిమజ్జనం వేళ నీళ్లు కూడా కలుషితం అవుతాయని తెలిపారు.