రాపో ( రామ్ పోతినేని) హీరోగా వచ్చిన గతంలో సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర మొత్తం బొక్కబోర్లా పడ్డాయి. ఇండివిడ్యువల్ హీరోగా రాపోకి ఎందుకో ఇంతవరకూ ఓ మాస్ ఇమేజ్గానీ, పాప్యులర్ స్టయిల్గానీ ఏమాత్రం సొంతం కాలేదు. తనవరకూ తనైతే వీరఫోజులు కొడుతూ, ఎమోషనల్గా చెలరేగిపోతూ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు స్క్రీన్ మీద. కానీ ధియేట్రికల్ ఇంపాక్ట్ మాత్రం శూన్యం. బోయపాటి శీను లాంటి మహామాస్ మాస్ డైరెక్టర్ స్కంద చిత్రాన్ని డైరెక్ట్ చేస్తే కూడా రాపో లేవలేదు సరికదా, బోయపాటినే కిందకు లాగేశాడు అనే విమర్శలు వెల్లువెత్తాయి. రాపోని ఎత్తబోయి బోయపాటి బొక్కబోర్లా పడ్డాడు. స్కంద సినిమా గానీ ఏ బాలకృష్ణో చేసుంటే వీరలెవెల్లో హిట్ అయ్యుండేదనే పాప్యులర్ కామెంట్ పుట్టుకొచ్చింది.
అందుకే ఇప్పుడు దర్శకుడు మహేష్ అతి తెలివితో, గడుసుగా ఒక్క రాపో మీదే ఆధారపడకుండా పక్కనే మరో ప్రూవ్డ్ మల్టీ లాంగ్వేజ్ స్టార్ని పెట్టుకున్నాడు. అదే కన్నడ స్టారే అయినా తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉన్న ఉపేంద్రని పెట్టుకున్నాడు. ఈ ప్రయోగం త్రివిక్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఇంతకు ముందే చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి బడా హీరో చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రని పోషించడానికి ఉపేంద్రని ఎంపిక చేసుకుని త్రివిక్రమ్ బాగా సక్సెస్ అయ్యాడు.
అదే స్కూల్ ఫాలో అవుతున్నాడు దర్శకుడు మహేష్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తన తదుపరి చిత్రంలో మెయిన్ క్యారెక్టర్కి ఉపేంద్రని లాక్కున్నాడు మహేష్. ఓ కమర్షియల్ చిత్రాన్ని లాక్కువెళ్ళడానికి రాపో స్టామినా సరిపోదనే ఒకే ఒక్క ఈక్వేషన్తో మరో స్ట్రాంగ్ యాక్టర్ ఎవరుంటే బావుంటుందని దూర్భిణి పెట్టి వెతికితే సన్ ఆఫ్ సత్యమూర్తి ఘన విజయానికి ఒక మూల స్తంభంలా హెల్ప్ అయిన ఉపేంద్ర మహేష్ మనసులో మెరిశాడు. అదే ఈ రోజున పెద్ద ప్లస్ అయింది.
సరే, అంధ్రాకింగ్ అని టైటిల్ ఉన్న చిత్రంలో కన్నడ స్ఠార్ ఉపేంద్ర ఏమిటనే విమర్శలు లేకపోలేదు. కానీ, అవన్నీ అంత ఆరోగ్యకరమైనవి కాదు. సత్యరాజ్ దగ్గర్నుంచీ శరత్ కుమార్ లాంటి ఎందరు తెలుగు సినిమాల్లో నటించడం లేదు. చివరికి దేశప్రధానమంత్రే నేను ఈ దేశానికి కట్టప్పలా నిలబడతాను అని చెప్పుకునే బాహుబలిలోని ప్రధానపాత్ర కట్టప్పని సత్యరాజ్ పోషించాడు. ఉపేంద్రకున్న ఫాలోయింగ్కి మచ్చుతునక, నిన్న జరిగిన సీతా పయనం సినిమా ఫంక్షన్లో ఉపేంద్రని చూసి జనం ఆంధ్రాకింగ్ అని విపరీతంగా కేకలు, పెడబొబ్బలు పెట్టడంతో త్రిబుల్ ఏ ధియేటర్ దద్దరిల్లిపోయింది