జూన్ 14వ తేది నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉండనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాతే మళ్లీ షూటింగ్(Shooting) స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పవన్ చేసే సినిమాల షూటింగులన్నీ ఇప్పుడు ఆగిపోనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.. జూన్ 16న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. కృతి సనన్ సీతగా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానున్నారు.
కారు ట్రక్కును ఢీకొనడం వల్ల ప్రమాదం(Car Accident) సంభవించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి(Actor Sudhi) ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarai vijayan) సంతాపం తెలిపారు.
సమంతా(Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం “కుషి” పాటల షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సామ్ పలు విషయాలను పంచుకుంది.
టక్కర్ మూవీ(Takkar movie) ప్రి రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని వెస్టిన్లో జూన్ 4న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
'భారీ తారాగణం' సినిమా నుంచి రెండే రెండక్షరాల ప్రేమ అనే లిరికల్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది.
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా విమానం మూవీ ట్రైలర్ విడుదలైంది. తాజాగా ‘విమానం’ మూవీ ట్రైలర్ను సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు చూసి స్పందించారు.
చిరంజీవి 'భోళాశంకర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు చిరు ఫుల్ గ్రేస్ స్టెప్స్ వేశారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరోయిన్గా తమన్నా కనిపించనున్నారు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand)ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి 11 గంటలకు రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. శర్వానంద్ హల్దీ ఫంక్షన్, సంగీత్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను విబి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్లను బతికించండని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
జబర్దస్త్ కమెడియన్..కెవ్వు కార్తీక్(Kevvu Karthik) త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్లో టీమ్ లీడర్గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు.
తనకు రియల్ హీరోలతో బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని హీరో నిఖిల్(hero nikhil siddharth) పేర్కొన్నారు. తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకల సురక్ష్ కార్యక్రమానికి హైదరాబాద్లో హారజైనట్లు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పింక్ కలర్ డ్రైస్ ధరించిన చిత్రాల్లో నుష్రత్ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) గొప్ప నటుడే కాదు.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. నందమూరి(Nandamuri) వారసుడు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానుల(Fans)ను సంపాదించుకున్నాడు.
సుమతి పాత్రలో అనసూయ నటించిన సినిమా 'విమానం'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం' విడుదల కానుంది. 'విమానం' సినిమాలో అనసూయది వేశ్య పాత్ర. 'విమానం'లో అనసూయను ప్రేమించే యువకుడిగా, చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో రాహుల్ నటించారు. ప్రస్తుతం టీవీ షోలకు అనసూయ దూరంగా ఉంటున్నారు.