HYD మాసాబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ఉన్నట్లు గుర్తించింది. ఇద్దరు వ్యాపారుల నుంచి 40గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది.