తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 57,147 మంది దర్శించుకున్నారు. అలాగే 26,094 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇకపోతే రేపు రామకృష్ణ తీర్...
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోనులు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ దాతృత్వం ప్రకటించింది. రూ.22 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరుకు టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారుల మధ్యలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మ...
ఈ నెల 5వ తేది నుంచి తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 5న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ గరుడ సేవ వేడుకగా సాగనుంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ఆ రోజ...
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్మించుకున్నారు. గురువారం కొండపై చేరుకున్న గవర్నర్ కు కలెక్టర్ పమేలా సత్పతి ,ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభు ఆలయంలోకి వెళ్లిన గవర్నర్ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్కు ఆశీర్వచనం చేశారు. అధ...
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని 11 వ వార్డు 14వ వార్డు మధ్య మ్యాచ్ ను నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరి...
ప్రపంచంలోనే అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభామేళాగా ఖ్యాతి పొందిన ములుగు జిల్లాలోని మేడారంలో సందడి మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ జాతర జరుగనుంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర రెండేండ్లకు ఒకసారి జరుగుతుందని అందరికీ తెలిసిందే. మహా జాతర తర్వాతి సంవత్సరం వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగె పండగ వస్తుంది. దీన్ని మినీ మేడారం జాతర అంటారు. ఈ జాతరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ [&...
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. ముందుగా సుగుణేంద్రతీర్థస్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ జరిపారు. భజనమండళ్ల సభ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు.వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన ...
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారు...
ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందని చిన జీయర్ స్వామిజీ వెల్లడించారు .అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారని తెలిపారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారని. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం...
విశాఖ శ్రీ శారదాపీఠంని మంత్రి రోజా సందర్శించారు. అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలో భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం పర్యాటక శాఖ తీసుకుంటున్న చర్యలు స్వామివారికి మంత్రి వివరించారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్నటువంటి చర్యలు తన దృ...
హిందువులు జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ, పార్వతులకు వివాహం జరిగిన రోజు కూడా అదే. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదిన రానుంది. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఏపీలోని ప్రముఖ శైవ క్...
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్...
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీ...
నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేప...