ప్రముఖ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడేవారే. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా అందరూ వాట్సాప్ వాడుతున్నారు. ఈ మధ్య శుభకార్యాలకు పిలుపులు కూడా వాట్సాప్ లోనే జరుగుతున్నాయి.
ఈరోజుల్లో నెట్ ఫ్లిక్స్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఓటీటీ రాజ్యం ఏలుతోంది. వాటిలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలలో ఈ ఓటీటీ ప్లాట్ ఫాంని వినియోగించేవారే. ఇందులో కొత్తగా విడుదలైన సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. పలు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. కాగా, ఈ ఓటీటీ ప్లాట్ ఫాం పై తాజాగా భారత ఐటీ శాఖ కన్నేసింది.
గూగుల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఐఓ 2023 కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్ గూగుల్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ బార్డ్ ను భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
భారత వ్యాపార దిగ్గజం అంబానీ రిలయన్స్ జియో(reliance jio)ను దేశంలో తీసుకురావటం పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్(Recharge) చేసేందుకు వంద సార్లు ఆలోచించిన భారతీయులు ఇప్పుడు వందల రూపాయలతో నెలవారీ ప్యాకేజీలు కొనుగోలు చేస్తున్నారు.
త్వరలో పోస్టాఫీసు మీ ఇంటికి పప్పులు, బియ్యంతో పాటు పిండి లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేస్తుంది. ఇందుకోసం ఓఎన్సీడీ (Open Network For Digital Commerce) తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ట్రేడర్స్ అసోసియేషన్ క్యాట్తో తపాలా శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది.
ఇప్పటి వరకు మనం వాడే బైకులన్నీ పెట్రోల్ సాయంతోనే నడుస్తాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా పెట్రోల్, కరెంటుతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సింపుల్ వన్(Simple One Electric Scooter) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 23న అధికారికంగా కస్టమర్లకు అందించనున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక రోడ్లపైకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) భారత్పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover)పై 81 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసింది. భారత్పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్, ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు.
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇది సురక్షితమైన, చౌకైన ప్రయాణ మార్గంగా పరిగణించబడుతుంది. కానీ, రైలులో ప్రయాణించే విషయంలో చాలా రకాల నియమాలు ఉన్నాయి. ప్లాట్ఫారమ్పై రైలు కోసం వేచి ఉండే సమయంలో రైల్వే నియమాలు పాటించాలి లేకుంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కంపెనీ దేశంలోని సామాన్యుల దగ్గరనుంచి సంపన్నుల వరకు వారి అవసరాలకు అనుగుణంగా పాలసీలను రూపొందిస్తుంది. బ్యాంకుల తర్వాత ప్రజల్లో నమ్మకం కలిగిన బీమా కంపెనీ ఎల్ ఐసీ. తాజాగా ఖాతాదారుల కోసం నూతన పథకాన్ని తీసుకొచ్చింది.
బెంగళూరు నగరంలో ఐఫోన్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది.
మీరు తక్కువ బడ్జెట్లో మంచి 5జీ ఫోన్ కొనాలని చుస్తున్నారా? అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే. ఎందుకంటే 20 వేల రూపాయల లోపు మంచి ఫీచర్లు ఉన్న టాప్ 8 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాం. వీటి గురించి ఓసారి తెలుసుకోండి మరి.
స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తన యూజర్ల(Users) కోసం ఫ్రీ 5జీ అపరిమిత డేటా(Unlimited Data)ఆఫర్ను ప్రకటించింది.