బైజూస్(Byjus) పేరుతో ఎడ్టెక్ ప్లాట్ఫారమ్ను నడుపుతున్న ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ రవీంద్రన్(Raveendran)కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది. వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని, విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. ఏజెన్స...
99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా ఈరోజు(ఏప్రిల్ 27న) తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ EVని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనం ఫీచర్లు, ధరను ఇప్పుడు తెలుసుకుందాం.
జియో టెలికం మార్కెట్లోకి ఎలా చొచ్చుకుపోయిందో గుర్తు తెచ్చుకోండి. డేటా, కాల్స్ అన్ లిమిటెడ్ గా ఉచితం. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కూడా ఇదే బాటలో నడుస్తోంది.
2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్పర్సన్గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా పెరిగింది. ప్రజలు డబ్బు పంపించడం, చెల్లింపులు చేయడం, షాపింగ్ చేయడం వంటి అనేకం డిజిటల్గానే చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సప్ ద్వారా కరెంటు బిల్లులను చెల్లించే సేవను కూడా ప్రారంభించింది.
భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
స్నేహమంటే చెరిగిపోనిది.. కష్టసుఖాల్లో కుటుంబసభ్యులు తోడు ఉన్నా లేకున్నా స్నేహితులు మాత్రం వెన్నంటే ఉంటారు. అలాంటి స్నేహితులు పొందిన వారికి ఏ కష్టం వచ్చినా ‘నా ఫ్రెండ్ ఉన్నాడు’ అనే భరోసాతో గట్టెక్కుతారు. అలాంటి స్నేహమే మనోజ్ మోదీ (Manoj Modi)- ముకేశ్ అంబానీలది (Mukesh Ambani). యూనివర్సిటీలో కలిగిన స్నేహం కంపెనీ అభివృద్ధిలో కూడా కలిసొచ్చింది. అంబానీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయిన వ్యక్తి మనోజ్ మ...
చందా చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోని కారణంగా వారందరి బ్లూ టిక్ లు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని పునరుద్ధరించింది. వారి ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విటర్ జోడించింది. అయితే ఈ బ్లూ టిక్ కోసం ఆ ప్రముఖులందరూ చందా చెల్లించలేదని తెలుస్తోంది.