దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 85,320.04 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,710.11 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 331.21 పాయింట్ల నష్టంతో 84,900.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.65 పాయింట్ల నష్టంతో 25,959.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.89.19గా ఉంది.