W.G: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 70 సంవత్సరాలు వయస్సు కలిగిన వృద్ధురాలు రైలు పట్టాల సమీపంలో చనిపోయి ఉండడంతో గుర్తించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు ఆమె ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు.
RR: మహేశ్వరం మండలం కేంద్రంలో ఆన్ లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. మహేశ్వరం సీఐ తెలిపిన వివరాలు.. పోచమ్మ బస్తీకి చెందిన ఎదిరే సాయి కిరణ్ (21) నారాయణగూడ ఓ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోయాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు చనిపోయారు.
జర్మనీలోని మాగ్డేబర్గ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రిస్మస్ మార్కెట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరి మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్లోకి దూసుకెళ్లిన కారులో పేలుడ పదార్థం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
జర్మనీలోని మాగ్డేబర్గ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ మార్కెట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరి మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్లోకి దూసుకెళ్లిన కారులో పేలుడు పదార్థం ఉన్నట్లు అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ASR: ఎటపాక మండలం రాయన్నపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుని కాలు పూర్తిగా తెగిపోయింది. గుర్తుతెలియని ఆ వ్యక్తి శరీరం నుంచి కాలు వేరుపడటం వల్ల తీవ్రంగా రక్తస్రావమై రోడ్డుపై విలవిల్లాడాడు. సమీపంలోని కొంతమంది ప్రజలు గమనించి, చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు.
SKLM: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పరిధిలో చెక్ బౌన్స్ కేసులో ఓ నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు పలాస సివిల్ కోర్టు జడ్జి యు. మాధురి వెల్లడించారు. ఈ మేరకు వివరాలు ప్రకారం.. బకాయి నిమిత్తం శ్రీరామ్ చిట్స్ బ్రాంచ్లో శ్రీధర్ అనే యువకుడు రూ. 1,4700 చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకొని యాజమాన్యం బ్యాంకుకు వెళ్లగా.. చెక్ బౌన్స్ అయిందని వెల్లడైంది.
VZM: కడుపునొప్పి తాళలేక ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జామిలో శుక్రవారం చోటుచేసుకుంది. జామి మండల కేంద్రంలో స్థానిక గొర్లెవీధికి చెందిన సిహెచ్. రవి (32) కొంతకాలం నుండి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఎస్సై వీర జనార్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HYD: మాదాపూర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్మాల్ సమీపంలోని సత్య భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇనార్బిట్ భవనం ఎదురుగా ఉన్న సత్య భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కంపెనీలోని ఉద్యోగులను అధికారులు బయటకు పంపించివేశారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
AP: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలోని బుళ్లసముద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టింది. ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
NGKL: చారకొండ మండలంలోని సారబండ తాండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ పై దేవరకొండ వైపు వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి ర్యాంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పావని (22) యువతికి తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలైనట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు తెలిపారు.
PLD: పిడుగురాళ్ల నుంచి దాచేపల్లికి బైక్పై వినోద్, వెంకటేశ్ అనే ఇద్దరు యువకులు వస్తుండగా బ్రాహ్మణపల్లి పరిధిలో శనివారం తెల్లవారుజామున అదుపుతప్పి రైలింగ్ను ఢీకొట్టి ఇద్దరు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో వినోద్ చనిపోగా.. వెంకటేశ్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
KMM: ఎటపాక మండలం రాయనిపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు- బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై ఉన్న వ్యక్తి సగం కాలు తెగి రోడ్డుపై పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వదిలేసి వెళ్లిన కారులో రూ.10కోట్ల నగదు, 52 కేజీల బంగారం దొరికన ఘటన మధ్యప్రదేశ్లో భోపాల్లో చోటు చేసుకుంది. అటవీ మార్గంలో భారీగా బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఇన్నోవా కారు మాజీ కానిస్టేబుల్ గౌరవ్ శర్మ అనే వ్యక్తిదని గుర్తించారు. బంగారం, డబ్బు కూడా అతనిదేనని అనుమానిస్తున్నారు.
సిక్కిం సెక్టార్లోని జులుక్ ప్రాంతంలో సైనికులు ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 12 మంది సైనికులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా తూర్పు ఎయిర్ కమాండ్ నుంచి చీతా హెలికాప్టర్లతో పాటు ఎంఐ-17 ఎయిర్క్రాఫ్ట్ను అధికార...