• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

విజయవాడు – అమరావతి RTCలో మంటలు

కృష్ణా: విజయవాడ నుంచి అమరావతి వెళుతున్న ఆర్టీసీ మెట్రో బస్సులో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. ప్రయాణికుల వివరాలు.. మందడం సెంటర్ వద్దకు రాగానే బస్సు టైర్ల నుంచి మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనతో బస్సు నుంచి దిగి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేసినట్లు తెలిపారు.

December 10, 2024 / 07:48 AM IST

విషాదం: కారు కొట్టుకుపోయి ఇద్దరు మృతి

AP: కాలువలో కారు కొట్టుకుపోయి ఇద్దరు మరణించిన ఈ ఘటన కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చింతవారిపేట సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. దంపతులు తమ ఇద్దరు కుమారులతో విశాఖ నుంచి పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త ప్రమాదం నుంచి బయటపడగా అతని భార్య, పెద్ద కుమారుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో కుమారుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

December 10, 2024 / 07:44 AM IST

నెల్లూరు జిల్లాలో నకిలీ RTOల అరెస్ట్

నెల్లూరు జిల్లాలో నకిలీ అధికారులు పోలీసులకు చిక్కారు. కందుకూరు DSP బాలసుబ్రహ్మణ్యం వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన లతీఫ్, సిరాజ్ నకిలీ ఆర్టీవోల అవతారం ఎత్తారు. నేషనల్ హైవేపై వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. ఈక్రమంలో ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు దగ్గర సోమవారం ఈ ఇద్దరిని ఎస్ఐ అంకమ్మ అరెస్ట్ చేశారు.

December 10, 2024 / 07:19 AM IST

చీమకుర్తిలో మహిళ నుంచి గంజాయి పట్టివేత

ప్రకాశం: చీమకుర్తి పట్టణంలో ప్యాకెట్ల రూపంలో గంజాయిని తీసుకెళ్తున్న మహిళ డి.భాగ్యమ్మను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనపరచుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

December 10, 2024 / 07:11 AM IST

నలుగురు అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్

అన్నమయ్య: రాయచోటిలో నలుగురు అంతరాష్ట్ర బైక్ దొంగలను అన్నమయ్య జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.65 లక్షలు విలువ చేసే 37 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మదనపల్లి ప్రాంతానికి చెందిన బత్తుల వినోద్‌, మరో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. బైకులు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అభినందించారు.

December 10, 2024 / 06:53 AM IST

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు

కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. నేలపూడి విజయ్ కుమార్ కుటుంబం కలిసి విశాఖపట్నం వెళ్లి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త విజయ్ కుమార్ కారు డోర్ తీసుకొని నీటిలో నుంచి బయటకు రాగా, భార్య ఉమ, పెద్ద కుమారుడు మనోజ్, రిషి గల్లంతయ్యారు.

December 10, 2024 / 06:43 AM IST

అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి

VSP: పాడేరు ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి పాల్పడిన ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్ పై ఫోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం గిరిజన సంక్షేమ డీడీ ఎల్. రజనికి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని డిమాండ్ చేశారు.

December 10, 2024 / 06:04 AM IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ప్రకాశం: బల్లికురవ మండలం గుంటుపల్లికి చెందిన పూసుకూరి హరిబాబు (39) పొలం పనితో జీవిస్తుండేవాడు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు ద్విచక్ర వాహనం మీద వచ్చి తిరిగి నూతన బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా పురుషోత్తమపట్నం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.

December 10, 2024 / 05:52 AM IST

దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్

W.G: గత నెల 9 న పాలకొల్లు సూర్య తేజస్సు నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కె. రజనీ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. వారి వద్ద నుంచి లక్ష విలువ చేసే బంగారు వస్తువులు రికవరీ చేసినట్టు చెప్పారు. గత నెల దొంగతనంలో ఒక ఇంట్లో రూ.2 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు, మరో ఇంట్లో వెండి వస్తువులు దొంగిలించారని తెలిపారు.

December 10, 2024 / 04:33 AM IST

స్కూటీని ఢీకొట్టిన బైక్

ఏలూరు పరిధిలోని వంగాయగూడెంలో సోమవారం ప్రమాదం జరిగింది. స్కూటీని బైక్ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ మీద వచ్చిన ముగ్గురు యువకులు పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఏలూరు ఒన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తీసుకెళ్లినట్లు తెలిపారు.

December 10, 2024 / 04:14 AM IST

తుక్కులూరు రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరు మృతి

ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో నవంబర్ 23వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న ఊటుకూరి చిట్టిబాబు(32) ఆదివారం ఉదయం మృతి చెందాడు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కటారి కృష్ణ, ఊటుకూరి లక్ష్మిలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గొల్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

December 8, 2024 / 11:02 AM IST

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బైకు ఢీకొనటంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించారు. అశ్వారావుపేట సమీపంలోని ఓ తోటలో కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

December 8, 2024 / 10:53 AM IST

పల్నాడు కారు ప్రమాదంలో జిల్లా వాసులు

NLR: పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి – నార్కట్‌పల్లి హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు మృతి చెందారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు.

December 8, 2024 / 08:47 AM IST

కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

SKLM: ఎచ్చెర్ల మండలం కొయ్యి రాళ్లకూడలి వద్ద చెన్నై-కలకత్తా హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దిండుగల్‌కు చెందిన లారీ డ్రైవర్ షేక్ షబ్బీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

December 8, 2024 / 08:28 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

TG: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగింది. బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుళ్లను జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వారిద్దరూ HYDలో మారథాన్‌లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు రాయపోల్ PSలో విధులు నిర్వహించే పరంధాములు, దౌల్తాబాద్ పీఎస్‌లో పనిచేసే పూస వెంకటేశ్వర్లుగా గుర్తించారు. 

December 8, 2024 / 08:26 AM IST