ATP: గుత్తిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసముండే ఈశ్వరరావు అనే లారీ డ్రైవర్ అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.