ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు దాటుతున్న గోపాల్ అనే వృద్ధుడిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.