VZM: సంక్షోభంలోనూ సంక్షేమ పాలనను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మక్కువ మండలం గోపాలపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించి ప్రజలకు ప్రభుత్వ పాలన గురించి వివరించారు.