ATP: బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్టు టీడీపీ మండల కన్వీనర్ మల్లి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరవుతారని చెప్పారు. మండలంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.