KRNL: గోనెగండ్ల మండలం కులుమాల సచివాలయ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. దాని చుట్టూ పిచ్చి మొక్కలు మొలకెత్తాయి. మూగజీవాలు గడ్డి తినడానికి అటుగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.