KDP: చిట్వేలి మండలం కే.కందులవారి పల్లిలో ఆదివారం ఉదయం పది గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని కోరారు.