కాకినాడ: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అభ్యర్థులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్సులతో రావాలన్నారు.