విశాఖ: తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం దారుణమని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శనివారం విమర్శించారు. దేవుడి ప్రసాదంపై ప్రభుత్వంలో ఉన్నవారే ఆరోపణలు చేయడం మొదటిసారిగా చూస్తున్నామన్నారు. దీనిపై న్యాయ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.