కృష్ణా జిల్లా: వైసీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నూజివీడు పట్టణంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల ఉత్సవాలను కూటమి ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఇకపై కూటమి నేతలు ప్రజలలోకి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు.