W.G: వీరవాసరం మండలం వడ్డిగూడెంలో కూలి పనికి వెళ్లిన సూర్యకుమారి(33) అనే మహిళ విద్యుత్ షాక్తో మరణించింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు పాలకొల్లు- భీమవరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.