WG: కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఓపెన్ మార్కెట్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను గ్రామస్తులకు అందించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు.