YS Sowbhagya: సీఎం జగన్‌కు వివేకా భార్య బహిరంగ లేఖ!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 01:11 PM IST

YS Sowbhagya: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారు. మీ తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో.. నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. సొంత కుటుంబంలోని వాల్లే హత్యకు కారణం కావడం, మళ్లీ వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఎంతో బాధించింది. మీ చిన్నాన్న నువ్వు సీఎం కావాలని ఎంతో తపించారు. కానీ అతనిపైనే విమర్శలు చేయడం నీకు తగునా? అని ఆమె అన్నారు.

ఇది కూడా చూడండి: USA: విమానం రద్దయితే ఆటోమెటిక్‌ రిఫండ్ వచ్చేలా అమెరికాలో కొత్త నిబంధనలు

న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపడం కరెక్టేనా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం అని ఆమె అన్నారు. హత్యకు కారణమైన వాళ్లకు మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం కరెక్టేనా? ఇలాంటివి నీకు ఏ మాత్రం మంచిది కాదు. హత్యకు కారణమైన వాడు నామినేషన్ దాఖలు చేశాడు. చివరిసారిగా ప్రార్థిస్తున్నా. ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని కోరుకుంటున్నానని ఆమె లేఖలో తెలిపారు.

ఇది కూడా చూడండి: Hair Tips: ఎండాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి చిట్కాలు

 

Related News

YS Sharmila: దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి

ఓటుని పనిలా భావించకుండా.. బాధ్యతలా భావించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన వాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.