టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు.
టీడీపీ నేతపై ఆర్జీవీ ఫైర్ అయ్యారు. ఆర్జీవీని బట్టలిప్పి కొడతానని వార్నింగ్ ఇచ్చిన ఆ సీనియర్ నేతకు డబుల్ ఖబర్దార్ అంటూ రామ్గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ విశాఖలోని రిషికొండ(rushikonda) కట్టడాలపై అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష టీడీపీ(TDP) పార్టీల మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటు విరుచుకుపడుతున్నారు. మీరంటే మీరే అక్రమాలు చేశారని దుయ్యబట్టుకుంటున్నారు. అయితే ఈ లొల్లి ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త డీఎస్పీ ఆఫీసు(dsp office)ను ప్రారంభించిన నేపథ్యంలో పేర్కొన్నారు.
తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కొత్తరకం జ్వరాన్ని వైద్యులు గుర్తించారు. స్క్రబ్ టైపర్ అనే ఆ జ్వరం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుందని, జ్వరం వచ్చిన వారు కచ్చితంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
తెలుగురాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. మరో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
ఏపీలో సీఎంఓలో డిజిటల్ సంతకాల ట్యాంపరింగ్ కేసు పురోగతికి వచ్చింది. ఇందులో భాగస్వామ్యులు అయిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ ఎస్పీ తెలిపారు.
చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది
కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారుల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు.
విశాఖలో వాలంటీర్ చేతిలో చనిపోయిన వృద్దురాలి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పరామర్శించారు.
కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబును జనాలు నమ్మడం లేదని.. అందుకే పుంగనూరు, అంగళ్లులో గొడవ చేసి, సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఆరోపించారు.
రుషికొండలో అక్రమ నిర్మాణాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళమెత్తారు. ప్రకృతి వనరులను మింగేస్తూ.. ప్రభుత్వ ఆస్తులను కాజేస్తున్నారని విరుచుకుపడ్డారు.