స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(Karumuri Venkata Nageswara Rao) ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం అరెస్టు అయ్యారని ఈ మేరకు గుర్తు చేశారు.
ఏపీలోని 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. టికెట్లలో 25 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తోన్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైళ్లను రేపు (ఆదివారం) ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
చంద్రబాబు తొలి రోజు సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు చంద్రబాబును విచారించిన అధికారులు.. 50 ప్రశ్నలు వేశారు.
బాలకృష్ణకు ఓ న్యాయం.. ఇతరులకు ఓ న్యాయమా అని దగ్గుబాటి పురందేశ్వరినీ పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.
నేటితో జగన్కు బెయిల్ వచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు 30కిపైగా కేసులు ఉన్న జైలు మోహన్ సీఎంగా ఉన్నారని, జనాల్లో ఉండాల్సిన చంద్రబాబు జైలులో ఉన్నారని కామెంట్స్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు అరెస్టు వ్యవహారం తీరు గురించి సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాదులు 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని క్వాష్ పిటిషన్ బాబు పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం పర్మిషన్ లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని చెబుతున్న న్యాయవాదులు
ఏపీలోని కాకినాడ జిల్లా రాజపూడిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. పామాయిల్ తోటలో అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో వారు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లినాడు, గల్ల బాబీగా గుర్తించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ...
స్కిల్ డెవలప్మెంట్ స్కాం(skill development scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును ప్రశ్నించేందుకు ఏసీబీ కోర్టు శుక్రవారం సీఐడీకి రెండు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ క్రమంలో చంద్రబాబును నేడు, రేపు సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే అసలు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు. బాబు ఏం సమాధానం చెబుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ వేదికగా చంద్రబాబు లాయర్ సిద్దార్థ లూథ్రా- ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య డైలాగ్ వార్ జరిగింది.
నందమూరి బాలకృష్ణ ఓ సర్టిఫైడ్ సైకో అని మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీలో చంద్రబాబు కేసుపై చర్చించకుండా టీడీపీ నేతలు తప్పించుకున్నారని, బాబు పిటీషన్ను కోర్టు కూడా కొట్టి వేసిందని, దమ్ముంటే తనతో చర్చకు దిగాలని ఏపీ మంత్రి రోజా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సవాల్ విసిరారు.
స్కిల్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. వర్చువల్గా జడ్జీ ముందు బాబును సీఐడీ అధికారులు ప్రవేశపెట్టగా.. ఆయన ఏడ్చేశారు.
స్కిల్ స్కామ్లో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ అభ్యర్థనను ఏసీబీ కోర్టు మన్నించింది. 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ నేతల తీరుతో ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రేపటి నుంచి జరిగే సమావేశాలకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.