• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శ్రీకాకుళం: టెక్కలి పాత హైవేపై రోడ్డు ఆక్సిడెంట్లో ఓ యువకుడు శనివారం సాయంత్రం మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన రావివలస మల్లేశ్వరరావు(32) అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంతబొమ్మాళికి వచ్చి తిరిగి వెళ్తుండగా టెక్కలి ఆట్ నుంచి దూకి తప్పించుకునే క్రమంలో లారీ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

September 22, 2024 / 07:13 AM IST

17 మంది హోంగార్డులకు నోటీసులు

SKLM: జిల్లాలో సక్రమంగా విధులకు హాజరుకాని 17 మంది హోంగార్డులకు ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం నోటీసులు జారీ చేశారు. ఈ 17 మంది సెప్టెంబరు 23 ఆదివారం ఉదయం 10 గంటలకు ఎచ్చెర్లలోని (ఆర్మ్ డ్ రిజర్వుడ్) ఏ. ఆర్ మైదానానికి రావాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు.

September 22, 2024 / 07:11 AM IST

వంద రోజుల పాలనపై మిశ్రమ స్పందన: సీపీఎం

విశాఖ: ప్రజా పోరాటాలతోనే ఏజెన్సీ అభివృద్ధి చెందుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స శనివారం అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజలు మిశ్రమంగా స్పందిస్తున్నారన్నారు. ఏజెన్సీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైనా సూపర్ సిక్స్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.

September 22, 2024 / 07:08 AM IST

రాజోలులో దారుణం.. కోడలిపై అఘాయిత్యం

కోనసీమ: ఉపాధి కోసం కొడుకు గల్ఫ్ దేశానికి వెళ్లగా అత్త వారి ఇంటి వద్ద ఉంటున్న కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాజోలు మండల పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. దీనిపై బాధితురాలు ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని రాజోలు ఎస్సై రాజేష్ కుమార్ శనివారం తెలిపారు. గతంలో ఒకసారి అత్యాచారానికి పాల్పడ్డాడని, మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నాడని అతని నుంచి రక్షణ కోరారు.

September 22, 2024 / 07:06 AM IST

మాచర్లలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

PLD: రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాల పాలైన సంఘటన మాచర్ల పట్టణ పరిధిలోని నాగార్జునసాగర్ హైవే వద్ద ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శనివారం రాత్రి జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 22, 2024 / 07:04 AM IST

BSP బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

SKLM: శ్రీకాకుళం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి, ముఖ్య అతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ జి పూర్ణచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు బి పరమ్ జ్యోతి, శ్రీకాకుళం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గరికపాడు పాల్గొన్నారు. ముస్లింలు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పలు సమస్యలు, సంస్థాగత కార్యచరణ అంశాలపై మాట్లాడారు.

September 22, 2024 / 06:57 AM IST

వృద్ధుడు మిస్సింగ్ పై కేసు నమోదు

KKD: కరప మండలం గొర్రిపూడికి చెందిన రామారావు (68) అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై సూరిబాబు శనివారం తెలిపారు. సైకిల్‌పై తిరుగుతూ బట్టలు విక్రయించే రామారావు 20 రోజుల క్రితం వ్యాపారంలో భాగంగా బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సైకి తెలిపారు.

September 22, 2024 / 06:53 AM IST

పరీక్ష రాయడానికి వెళ్తూ అనంత లోకాలకు

కాకినాడ: పరీక్ష రాసేందుకు విజయవాడ నుంచి విశాఖకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన గంటకే ఇద్దరూ అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కడుపుకోత మిగిలింది. కాకినాడ జిల్లా 16వ నెంబరు జాతీయ రహదారిపై తుని మండలం ఎర్రకోనేరువద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీబీఏ విద్యార్థులు మృతి చెందారు.

September 22, 2024 / 06:53 AM IST

రేపు యదావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

తూ.గో: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబరు 23వ తేదీన యధావిధిగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, అర్జీలని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండే డివిజనల్, మున్సిపల్, మండల అధికారులకి అందజేయాలన్నారు.

September 22, 2024 / 06:43 AM IST

VIDEO: జగన్ చిత్రపటాన్ని దహనం చేస్తూ VHP నిరసన

కోనసీమ: తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద కల్తీ నీచమైన పని అంటూ ఆలమూరు మండలం చెముడులంక విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన తెలిపారు. జగన్ చిత్రపటాన్ని దహనం చేశారు. లడ్డూ నాణ్యతపై ఎప్పటి నుంచో వివాదం జరుగుతుందని కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

September 22, 2024 / 06:41 AM IST

ఆటోను ఢీ కొట్టిన కారు

BPT: బాపట్లలో శనివారం రాత్రి ఓ ఆటోను కారు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాత్రి బాపట్ల సూర్యలంక రహదారిలో వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిందన్నారు. ఆటోను ఢీ కొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఆ కారును అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

September 22, 2024 / 06:41 AM IST

చిల్లకూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

TPT: చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో కారులోని ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో మృతి చెందారు. గాయపడ్డ మరికొంతమందిని వైద్య చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

September 22, 2024 / 06:41 AM IST

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు 10 మంది ఎంపిక

ప్రకాశం: SGFI రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సింగరాయకొండ మండలంలోని పాకల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు, ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీ.వీఎస్ ప్రసాద్ శనివారం తెలిపారు. జిల్లాస్ధాయి జూడో ఎంపిక కార్యక్రమంలో అండర్-14 విభాగంలో జూడోలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.

September 22, 2024 / 06:37 AM IST

ఉచిత ఇసుక పాలసీపై అవగాహన

తూ.గో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ ఆన్‌లైన్‌ ఇసుక నిర్వహణ వ్యవస్థ పై తహశీల్దార్లు పూర్తి అవగాహన పెంపొందించుకుని మండల స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ సూచించారు. శనివారం ఇసుక నిర్వహణ వ్యవస్థ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వినియోగంపై అమలాపురం కలెక్టరేట్‌లో తహశీల్దార్లకు, రవాణా ఏజెన్సీలకు అవగాహన కల్పించ...

September 22, 2024 / 06:36 AM IST

నిడమానూరును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీ

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలంలోని నిడమానూరు ఉన్నత పాఠశాలను జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారిణి ప్రమోద శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి వృత్తి విద్యా కోర్సుల బోధనకు ప్రభుత్వం అందించిన సామగ్రిని సద్వినియోగం చేయాలన్నారు.

September 22, 2024 / 06:34 AM IST