స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. మరి నేటి విచారణకు బాబు ఊరట లభిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొద్ది సేపు ఆగాల్సిందే.
తండ్రి జైలులో ఉంటే బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వివరించారు.
ఏపీ సీఎం జగన్ ఆర్థిక ఉగ్రవాది అని టీడీపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు.
అక్టోబర్ 1వ తేది నుంచి జనసేన వారాహి విజయయాత్ర నాలుగో విడత ప్రారంభం కానుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ఆ యాత్ర పునఃప్రారంభమవుతుందని, జనసేన సైనికులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు సీరియస్ నెస్ దృష్ట్యా రేపు విచారించే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మరోసారి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి హింట్ ఇచ్చారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.
చంద్రబాబుకు మరో 11 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. సోమవారం బెయిల్పై విచారణ ఉంటుందని జడ్జి తెలిపింది.
చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన్ని కోర్టు ముందు సీఐడీ హాజరుపరిచింది.
మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జనసేన కింద టీడీపీ పనిచేస్తోందని.. కూటమి గెలిస్తే పవన్ సీఎం అవుతారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ స్కామ్లో సీఐడీ దూకుడు కొనసాగుతోంది. రెండో రోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది. కిలారు రాజేశ్ షెల్ కంపెనీల నిధులను లోకేశ్కు పంపించారని తెలిసింది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. మరో వైపు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులను అచ్చెన్నాయుడు ప్రకటించారు. జనసేన నాయకులతో నారా బ్రహ్మాణి చర్చలు జరుపుతోంది. రాష్ట్రం వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలను టీడీపీ నేతలు చేపడుతున్నారు.
అనంతలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. జనం కనిపిస్తే చాలు రూ.వేలకు వేలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు.
స్కిల్ స్కామ్లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.