విశాఖ ఎన్ఏడీ జంక్షన్ వద్ద వాషింగ్ మెషిన్లో గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడ్డాయి.
ఏపీలో నేటి నుంచి బస్సు యాత్రను నారా భువనేశ్వరి ప్రారంభించారు. మొదటి రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో ఈ ఏడాది అపశృతి జరిగింది.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు.
'నిజం గెలవాలి' అనే పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నారు. బుధవారం ఆ యాత్ర చంద్రగిరి నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆవేదనతో ప్రాణాలు వదిలిన టీడీపీ కార్యకర్తలను, అభిమానుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
ఏపీకి తుఫాన్ ముప్పు వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తమ సమావేశంలో ప్రధానంగా చర్చించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ విధానాలకు తమ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకమని ప్రకటించారు.
టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో మొదటగా చంద్రబాబు అరెస్ట్ను ఇరు పార్టీల నేతల ఖండించారు. ప్రధానంగా ఆరు అంశాలపై సమావేశంలో చర్చలు సాగనున్నాయి.
ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో కొండ కిక్కిరిసిపోయింది.
వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల వివాహం ఘనంగా జరిగింది
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలో తాను తిరిగొచ్చి మేనిఫెస్టోను విడుదల చేస్తానని తెలిపారు.
గోదావరి నది వద్దకు విహార యాత్రకు వచ్చి నలుగురు యువకులు మృతిచెందారు. నదిలో స్నానం చేయడానికి దిగి ఓ వ్యక్తి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అతడిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు స్నేహితులు కూడా నదిలో గల్లంతయ్యారు. పోలీసులు ఆదివారం వారి మృతదేహాలను వెలికితీశారు.
డిసెంబర్లో విశాఖకు రాజధాని రానుందని వార్తలు వచ్చాయి. కానీ 'విశాఖ రాజధాని ఇప్పట్లో లేనట్లే' అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం వసూలు చేస్తున్న ఆర్టీసీ ఛార్జీల కంటే యాభై శాతం అధికంగా వసూలు చేస్తున్నరని ప్రయాణికులు వాపోతున్నారు
క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు.