VJM: స్నేహశీలి సీతారామ్ ఏచూరి అని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. విజయనగరంలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుపోయే వ్యక్తి అని అన్నారు. ఆయన సిద్ధాంతం కోసం చివరి వరకు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.
NDL: బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 24న మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు MEO స్వరూప ఓ ప్రకటనలో వెల్లడించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆయా గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు, మండల కోఆర్డినేటర్కు తమ వివరాలను సమర్పించాలని ఎంఈవో సూచించారు. క్రీడా పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రకాశం: మండల కేంద్రంలోని నూతన సచివాలయం, రైతు సేవ కేంద్రాలు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలో ఈ భవనాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని సర్పంచ్ తాతపూడి సురేశ్ బాబు తెలిపారు. సచివాలయం రైతు సేవ కేంద్రానికి వెళ్ళేటకు రహదారి పనులను సర్పంచ్ సురేశ్ బాబు పర్యవేక్షించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రహదారికి కంకర చిప్స్ వేయించి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద ఆదివారం పర్యటకులు సందడి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం దేశ నలుమూలల నుండి చాపరాయి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయి వద్ద ఉన్న గార్డెన్ వద్ద పర్యటకులు సరదాగా గడిపారు, అలాగే దింసా నృత్యంలో పాల్గొని సందడి చేశారు.
కృష్ణా: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కుబడులు చెల్లించుకుని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ELR: కుక్కునూరు మండలం పెద్దరాయిగూడెం పంచాయతీ బరపట్టినగరం గ్రామంలో ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొరగం శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 కుటుంబాలు గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. దీంతో గ్రామంలో విద్యుత్తు సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
AKP: గొలుగొండ శాఖ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని గొలుగొండ శాఖ లైబ్రేరియన్ రాజుబాబు తెలిపారు. ఇందులో భాగంగా నేడు మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో పుస్తకాలు చదివించామని పేర్కొన్నారు.
కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు వచ్చు పర్యాటకులు మెరైన్ పోలీస్ వారి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని పాలకాయ తిప్ప మెరైన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం హంసలదీవి బీచ్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులకు సముద్ర స్నానాలు ఆచరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు.
ASR: జిల్లా కేంద్రం పాడేరులో BSNL సేవలు నెలరోజులుగా తరచూ మొరాయిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి సేవలు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. 2006 పాడేరు ఏజెన్సీలో మొట్టమొదటిగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. తరచూ సంకేతాలు మూగపోవడంతో వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు.
బాపట్ల: చీరాలలో పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వా విద్యా లయం పేరును మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మార్చుకోవాలని.. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
AKP: అనకాపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కసింకోట మండలం నర్సింబల్లిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
NLR: రాపూరు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు ఎస్సై వెంకట రాజేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ… రాపూరు పట్టణంలో ని పాత బస్టాండ్, మూడు రోడ్ల కూడలిలో ప్రధాన రహదారులపై అడ్డంగా పెట్టిన వాహనాలు, తోపుడు బండ్ల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. అనంతరం ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ప్రకాశం: సంతనూతలపాడులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎండ్లూరు వద్ద గల ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళాసాధికర కేంద్రంలో 3నెలల పాటు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ అధికారి జె. రవితేజయాదవ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 15-45 సంవత్సరాలలోపు గల నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: మర్రిపాడు మండల కేంద్రానికి చెందిన ఏడేళ్ల ఓ చిన్నారికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో పాప వైద్య చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని కూరగా తన వంతు సహకారం గా 25000 అందించి మానవత్వం చాటుకున్న మర్రిపాడు టిడిపి సీనియర్ నాయకులు SK మహబూబ్ సాహెబ్. నేడు చిన్నారికి రూ. 25,000 అందించిన మహబూబ్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు.. ఈ చిన్నారి వైద్యానికి దాతలు సహాయపడాలని కోరారు.
NLR: వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం కేంద్రంలో రవాణా శాఖకు సంబంధించి యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాహనదారులు కోరుతున్నారు. గతంలో కావలిలో ఉన్న యూనిట్ కార్యాలయాన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయంగా ప్రభుత్వం మార్పు చేసి రుద్రకోటలో ఏర్పాటు చేసింది. ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, లైసెన్సులు, ఫిట్నెస్ కొరకు 110 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని వాహణదారులు వాపోతున్నారు.