E.G: గోకవరం మండల ప్రాంతంలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు సంచరించినట్లు కనిపిస్తే, ఆటోల్లో ప్రయాణిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటోల్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు ఆటో ఎక్కితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.