ELR: యువత క్రీడల్లో రాణించాలని చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ అన్నారు.ఇటీవల కర్నూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి జావెలిన్, డిస్కస్ త్రో క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైన కుమారి వి. భార్గవి, జి. నీలమాలను ఎమ్మెల్యే సత్కరించారు. క్రీడలు ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయన్నారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.