PPM: పోస్ట్ డిజాస్టర్పై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఎటువంటి సమస్య వచ్చిన సమన్వయంతో సాధించగలమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారని కలెక్టర్ వివరించారు.