KRNL: భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మొదలైన రద్దీ రోజులలో కూడా నిర్దిష్ట వేళలలో శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, 11:45 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.