ప్రకాశం: యూరియా కొరతతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రకాశం జిల్లా కొండపి వైసీపీ ఇన్ఛార్జ్, మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మొబైల్ ఫోన్లో యూరియా కొరకు రైతులు చెప్పులను క్యూలైన్లో ఉంచిన వీడియోను చూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.