KRNL: వెల్దుర్తి పట్టణంలో ఇవాళ రాత్రి 14వ వార్డులో అంగడి ఈశ్వర్ నాయుడు ఇంటి సందులో ఓ ముస్లిం మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.