ASR: అనంతగిరి మండలంలోని కోనాపురం పంచాయతీ పరిధి వంట్లమామిడికి తుఫాన్ ప్రభావంతో కొండ చరియలు విరిగి పడతాయని గిరిజనులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాహశీల్దార్ సత్యనారాయణ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది వంట్లమామిడి గిరిజనులను పంచాయతీ పరిధి చప్పడిలో ఉన్న సురక్షిత పాఠశాల భవనానికి తరలించారు. వారికి ఆహారం, బియ్యం, నిత్యవసర సరుకులు అందజేస్తామన్నారు.