ASR: ఈనెల 13వ తేదీ నుండి జనవరి 10వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పాడేరు మండల తహసీల్దార్ వంజంగి త్రినాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పాడేరు మండలంలో 26పంచాయతీల సచివాలయం పరిధిలో ఉదయం 9.30గంటల నుండి సాయంత్రం 5గంటలకు వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుండి వినతులు స్వీకరించి భూమి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.